మంచిర్యాలలో వైభవ్‌ జ్యూయలర్స్‌ ప్రారంభం

Mar 24,2024 22:45 #opened, #vaibhav jwellery

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :ఆంధ్రా, తెలంగాణల్లో ప్రఖ్యాతిగాంచిన వైభవ్‌ జ్యూయలర్స్‌ (మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ ‘ఎన్‌’ జ్యూయలర్స్‌ లిమిటెడ్‌) తన 15వ బ్రాంచిని తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో శ్రీ వెంకటేశ్వర థియేటర్‌ ఎదురుగా, గంగారెడ్డి రోడ్డులో ఆదివారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సర్వోదయ నర్సింగ్‌ హోమ్‌ వైద్యులు డాక్టర్‌ విష్ణువర్ధనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోరూమ్‌ను ఇతర అతిథులతో కలిసి ప్రారంభించారు. కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తోగరు సుధాకర్‌, వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ఎమ్‌డి నల్లా వెంకట నారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఎమ్‌డి గుర్రల శ్రీధర్‌ తొలి కొనుగోలు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో వైభవ్‌ సంస్థల సిఎమ్‌డి గ్రంధి భారత మల్లికా రత్నకుమారి, సిఒఒ గొంట్ల రాఖాల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింధూరి వెంకటేష్‌, వైభవ్‌ జ్యూయలర్స్‌ ఏలూరు ఎమ్‌డి గ్రంధి అమరేంద్ర పాల్గొన్నారు.

➡️