మృతుని కుటుంబానికి రూ.10.25 లక్షల పరిహారం

ఆందోళనలో పాల్గొన్న స్థానిక మహిళలు, నాయకులు

ఆందోళనతో దిగొచ్చిన ‘అభిజిత్‌’ యాజమాన్యం

ప్రజాశక్తి-అచ్చుతాపురం

అభిజిత్‌ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ అకాలంగా గుండెపోటుతో మృతి చెందిన సుందరపు సత్యారావు కుటుంబానికి 10 లక్షల 25 వేల రూపాయలు పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. అభిజిత్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న మడుతురు గ్రామానికి చెందిన సత్యారావు విధి నిర్వహణలో ఉండగా అనారోగ్య పరిస్థితి ఏర్పడడంతో బుధవారం మృతి చెందిన విషయం విధితమే. మృతుని కుటుంబానికి పరిహారం ఇవ్వాలని కుటుంబీకులు యాజమాన్యాన్ని అడిగిన స్పందించకపోవడంతో సిఐటియు, జనసేన ఆధ్వర్యాన బుధవారం రాత్రంతా సత్యారావు మృతదేహంతో పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు యాజమాన్యం స్పందించి నాయకులతో చర్చించి మృతుడి కుటుంబానికి 10 లక్షల 25 వేల రూపాయలు పరిహారం చెల్లించడానికి ఒప్పందం చేసింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌.రాము వైయస్సార్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దేశం శెట్టి శంకర్రావు, జనసేన పార్టీ వీర మహిళ ఎం త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

➡️