మెరుగైన వైద్య సేవలు అందించాలి

Dec 8,2023 20:58

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కార్పొరేట్‌కు ధీటుగా రాయచోటి వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి అభివద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు. ఇక్కడి పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కషితో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అంటే రోగులకు ధైర్యం, నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందేలా చూడాలన్నారు. లీవ్‌, డిప్యుటేషన్లతో ఖాళీ వైద్యుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేసుకోవాలన్నారు.వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముందే ఇప్పటి నుంచే వసతులను పెంచాలన్నారు. మూడు ఆపరేషన్ల థియేటర్లను అందుబాటులోకి త్వరగా తీసుకు రావాలన్నారు. ఎసిలు, లిఫ్ట్‌ల ఏర్పాటుపై చర్చించారు ఆక్సిజన్‌ ప్లాంట్‌ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏఏ విభాగాలకు ఎన్నెన్ని ఆక్సిజన్‌ బెడ్లు అవసరమో ఆయన ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ టి.డేవిడ్‌ సుకుమార్‌తోనూ, వైద్యాధికారులతో ఆరా తీశారు. ఆక్సిజన్‌ను నిల్వ ఉంచే ఏర్పాట్లపై చర్చించారు.సమిష్టి కషి సహకారంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య పరీక్షల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. నూతన భవనాలలో సోమవారం నుంచే వైద్య సేవలు ప్రారంభం కావాలన్నారు. విభాగాల కేటాయింపు, వైద్య పరికరాలు ఏర్పాటు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు. తాగునీటి సరఫరా చర్యలును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోజూ సుమారు 750 మందికి పైగా ఒపికి రోగులు వస్తున్నారని, వారికి నాణ్యమైన, సంతప్తికరమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలలో మహిళలకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైద్య రంగంపై ప్రత్యేక దష్టి సారించారన్నారు. మెడికల్స్‌, సర్జికల్‌ విభాగాల నిర్వహణకు ఏడాదికి రూ.80 లక్షల మేర వ్యయం అవుతాయని అధికారులు తెలిపారు. ట్రామా కేర్‌, కార్డియాలజీ సేవల ఏర్పాటుకు కషి చేద్దామన్నారు. ఆసుపత్రి పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగణకు మరింత చర్యలు చేపట్టాలన్నారు. ఆర్చి, రహదారుల నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీలోగా వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను ప్రారంభించేందుకు సిద్ధమవుదామన్నారు. డయాల్‌ సిస్‌ కేంద్రం మరింత అభివద్ధికి కషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డయాల్‌ సిస్‌ కేంద్ర భవనాన్ని కూడా నూతన భవనాలలోని అన్ని వసతులుతో కూడిన భవనంలోకి మార్చాలన్నారు. ప్రారంభానికి సిద్దమవుతున్న నూతన భవనాలను శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఆర్చిలు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో మంచి చెట్లు నాటి పచ్చదనం పెంపొందించాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష వైద్యాధికారులుకు సూచించారు. మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేద్దామన్నారు.కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫయాజర్‌ రెహమాన్‌, ఆసుపత్రి అభివద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్‌ ఖాన్‌, ఫమీదా, వైద్యాధికారులు డాక్టర్‌ బండారు కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ రెడ్డిమహేశ్వర రాజు, డాక్టర్‌ రెడ్డి భాస్కర్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మీ ప్రసాద్‌, డాక్టర్‌ కోటేశ్వరి, డాక్టర్‌ ఖదీర్‌, ఎపిఎంఎస్‌ఐడిసి డిఇ రాజగోపాల్‌ రెడ్డి, కౌన్సిలర్లు ఆసీఫ్‌ అలీఖాన్‌, కొలిమి ఛాన్‌ బాష, షబ్బీర్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, రియాజ్‌, గౌస్‌ ఖాన్‌, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, అన్నా సలీం, కొత్తపల్లె ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

➡️