- 4008 మందికి ప్రోటోకాల్ దర్శనం
ప్రజాశక్తి తిరుమల : తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార తలుపులు తెరుచుకున్నాయి. 12 గంటలకు తలుపులను తెరిచిన అర్చకులు పూజా కైంకర్యాలు నిర్వహించారు.. దాదాపు మూడున్నర గంటల పాటు టిటిడి ప్రముఖులకు దర్శనం కల్పించింది. నిర్దేశించిన సమయం కన్నా 45 నిమిషాల ముందే సర్వ దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనాల భక్తులను ఆలయంలోకి టిటిడి అనుమతించింది. ప్రముఖులు,సామాన్య భక్తులతో తిరుమల కిటకిటలాడింది.. భక్తుల తాకిడి దృష్ట్యా ముందుగానే తిరుపతిలో టోకెన్లను సామాన్య భక్తులకు టిటిడి జారీ చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులు పోటెత్తారు..మూడున్నర గంటల పాటు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందని,భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుందని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఏ చిన్న సమస్య రాకుండా ఈ సారి పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు..రూ 300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శన టికెట్ల స్లాటెడ్ దర్శనాలను నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాల ముందే ప్రారంభించామని, తెల్లవారు జామున 1:30 నిమిషాలకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు..మొత్తం 4008 వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు జారీ చేశామన్నారు.. క్యూ లైనులోకి వచ్చే భక్తులకు పాలు కాఫీ,అల్పాహారం అందిస్తున్నామన్నారు.
దర్శించుకున్న ప్రముఖులు : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్రా, సూర్య కాంత్,హిమ కోహ్లీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఎల్ భట్టి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తారాల రాజశేఖర్, కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్
రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి,ఉష శ్రీ చరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్, బిజెపి నేత సిఎం రమేష్, ఎంపి రఘురామ కృష్ణంరాజు, మంత్రి రోజా, టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల, ఎంపి కేశినేని నాని, టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు