సర్పంచుల సమస్యలపై పోరాటం చేయాలి

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: అపరిష్కృతంగా ఉన్న గ్రామ సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని మార్కాపురం మండల సర్పంచుల సంఘం నాయకు లు శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగళా ఆవరణ వద్ద డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలని, కానీ నేడు అటువంటి గ్రామాలు సమస్యలతో కునారిల్లుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల హక్కులు కూడా హరించుకుపోతున్నాయని వాపోయారు. ఒక పార్టీ రంగు పూసుకొని సర్పంచుల సంఘ నాయకులమని మరోసారి మార్కాపురం ప్రాంతంలో తిరిగే నాయకులకు బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సర్పంచ్‌ దయ్యాల నాథగురుబ్రహ్మం, భూపతిపల్లి సర్పంచి మున్నంగి కోటేశ్వరి లాజరు, కోలభీమునిపాడు సర్పంచ్‌ చిట్యాల సుబ్బారెడ్డి, ఇమ్మడి శ్రీరాములు, డి వెంకటేశ్వరరెడ్డి, కె బాలమ్మ, వి వెంకటేశ్వర్లు, గోపిరెడ్డి, శ్రీను, టి రమణమ్మ వెంకటేశ్వర్లు, నాగరాజు, సుబ్బారెడ్డి తదితర సర్పంచులు పాల్గొన్నారు.

➡️