సిపిఎం అభ్యర్థులనే గెలిపించాలి

ప్రచారం చేపడుతున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -అనంతగిరి:గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు నిరంతరం పోరాడే సీపీఎం బలపర్చిన అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం లంగుపర్తి పంచాయతీలో జన్ని భీమన్న ఆధ్వర్యాన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి ప్రజలను ఉదేశించీ సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు మాట్లాడుతూ, జీవో 3 సాధించాలంటే సీపీఎం అభ్యర్థిలను గెలిపించాలని కోరారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ పార్టీతో కుమ్మక్కై పరోక్షంగా పొత్తు పెట్టుకున్న వైసీపీని కూడా ఓడించాలని పిలుపు నిచ్చారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోకూరు సీపీఎం సర్పంచ్‌ కిల్లో. మోస్య, సీపీఎం నాయకులు జన్ని భీమన్న, వార్డు మెంబర్‌ జన్ని .సుబ్బారావు, గెమ్మెల దేముడు, కుమార్‌, శివాజీ, రామన్న, పండన్న పాల్గొన్నారు.

➡️