ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Dec 21,2023 02:27

ప్రజాశక్తి – రేపల్లె
ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్ అన్నారు. మౌంట్ ఫోర్డ్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరికీ ఆశీస్సులను అందించారు. ఏసుక్రీస్తు చూపిన శాంతిమార్గాన్ని మానవాళి అనుసరించాలని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బ్రదర్ జాన్ పాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️