పలువురు ఉద్యోగులకు సన్మానం

పలువురు ఉద్యోగులకు సన్మానం

పలువురు ఉద్యోగులకు సన్మానం ప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుపతి ప్రజా రవాణా విభాగంలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఈ నెల చివరలో ఉద్యోగ విరమణ చేస్తున్న నలుగురు ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా రవాణా అధికారి టి.చెంగల్‌ రెడ్డి విశిష్ట అతిథిగా విచ్చేసి కొనియాడారు. రమేష్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఫైనాన్స్‌, పీసీ బాబు సూపరింటెండెంట్‌ పర్సనల్‌, వీఆర్వో బి. కష్ణ రెడ్డి, టీటీఐ బి మణి ఉద్యోగ విరమణ సందర్భంగా పలువురు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజరు ఎం భాస్కర్‌ రెడ్డి, డిప్యూటీ సిఎంఈ జి. నరసింహులు పాల్గొన్నారు.

➡️