మండుటెండలోనూ…ఉత్సాహంగా సిఎం జగన్‌ యాత్ర

Apr 20,2024 13:08 #CM YS Jagan

ప్రజాశక్తి-అనకాపల్లి
మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా 19వ రోజు సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి మేము సైతం సిద్ధం బస్సు యాత్ర శనివారంనాడు కొనసాగుతోంది. రోడ్డుకు ఇరువైపులా జనం కిటకిటలాడుతూ కనిపించారు. అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద అమలాపురం జనసేన పార్టీ నుంచి సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన పలువురు సీనియర్‌ నేతలుచేరారు. జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన అమలాపురం సీనియర్‌ నేత, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డీఎం ఆర్‌ శేఖర్‌, దుర్గాభవాని చేరారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరించి సిఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు ముందు నిలబడి స్వాగతం గొడిచర్ల గ్రామస్తులు స్వాగతం పలికారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరరుకున్నారు. మధ్యాహ్నం అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గని ప్రసంగిస్తారు

➡️