మచిలీపట్నం కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థిగా గొల్లు కృష్ణ

Apr 22,2024 14:24 #COM

ప్రజాశక్తి-కలెక్టరేట్
మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గొల్లు కృష్ణ పేరు ఖరారైంది. లోక్‌ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. గొల్లు కృష్ణ 2019లోనూ మచిలీపట్నం ఎంపి స్థానానికి కాంగ్రెస్‌ నుండి పోటీ చేశారు. పిసిసి ఉపాధ్యక్షునిగా వ్యవహరించిన గొల్లు కృష్ణ గతంలో ఆలిండియా హ్యాండ్‌ లూమ్‌ బోర్డు మెంబర్‌గా, స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా సేవలు అందించారు.

➡️