తిరుపతి సిటీ : తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట సెంట్రల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వాహనం, బైకును ఢకొీట్టి ఇంటర్ విద్యార్థి గాయాలపాలైన ఘటన మంగళవారం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జయంత్ అనే విద్యార్థి బైక్ తగులుతుండగా గుర్తుతెలియని వాహనం ఢకొీని తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న మొలకలచెరువు ఎస్ఐ తిప్పేస్వామి ఘటన స్థలం వద్దకు చేరుకొని క్షతగాత్రుని చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు డాక్టర్లు తెలిపారు.