టిడ్కో గృహాలను వైసీపీ నిర్వీర్యం చేసింది : జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్

Apr 5,2024 00:56

ప్రజాశక్తి – రేపల్లె
టీడ్కో గృహాలను కక్షగట్టి వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఆరోపించారు. పట్టణంలో నిరాదరణకు గురైన డిడ్కో గృహాల వద్ద టిడిపి కూటమి ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 2014లో టిడిపి ప్రభుత్వం పేదలందరూ గౌరవంగా తలెత్తుకొని బ్రతికే విధంగా జి ప్లస్ త్రీ నిర్మాణాలను చేపట్టిందని గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి గత ప్రభుత్వంపై ఉన్న కక్షతో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా ఆపివేసిందని అన్నారు. వివిధ కేటగిరీల్లో ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు ఇవ్వకుండా నిలిపివేసి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పేదలకోసం నిర్మించిన ఇళ్లను వైసిపి ప్రభుత్వం బ్యాంకులో తాకట్టు పెట్టుకుని రుణాలను తీసుకోవటం వలన లబ్ధిదారులైన పేదలకు బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయని చెప్పారు. పేదల ఇళ్లను తాకట్టు పెట్టుకోవటమేనా పేదలకోసం పనిచేయడమంటే అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గోగినేని పట్టాభి రామారావు, వెనిగళ్ళ సుబ్రమణ్యం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

➡️