కరణం వెంకటేష్‌ ప్రచారం

ప్రజాశక్తి-చీరాల చీరాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త కరణం వెంకటేష్‌కు సిఎం జగన్మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారని, ప్రజలందరూ మద్దతు ఇచ్చి తన భర్తను గెలిపించాలని వెంకటేష్‌ సతీమణి గీత అన్నారు. గురువారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పేరాలలో ఎర్రటి ఎండని సైతం లెక్కచేయకుండా ఆమె గడప గడపకూ వైసిపి కరపత్రాలను పంచుతూ ప్రజలతో మమేకమై వెంకటేష్‌తో కలసి ప్రచారం చేపట్టారు. నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వెంకటేష్‌ గెలుపునకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. అయితే ఎన్నికల ప్రచారంలో భర్త వెంకటేష్‌తో కలసి పలుచోట్ల గీత పాల్గొంటూ ఆయా ప్రాంతాల మహిళలను కుటుంబ సభ్యురాలిగా పలకరిస్తూ తనదైన శైలిలో చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారం వైసీపీ మహిళా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ జగదీష్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️