ముంబయి రంజీజట్టు కెప్టెన్‌గా రహానే

Jan 1,2024 21:27

ముంబయి: ముంబయి రంజీజట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానే ఎంపికయ్యాడు. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసిఏ) సోమవారం ఓ ప్రకటనలో 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముంబయి జట్టు రంజీ టోర్నమెంట్‌లో బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లతో తొలి లీగ్‌ మ్యాచ్‌లను ఆడనుంది. 2023 సీజన్‌లో ముంబయి జట్టు ఎలైట్‌ గ్రూప్‌-బిలో 4వ స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయింది. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా అంతర్జాతీయ టోర్నీల్లో ఆడుతున్న దృష్ట్యా వీరిద్దరి పేర్లను పరిశీలించలేదని ఎంసిఏ ఆ ప్రకటనలో పేర్కొంది. ముంబయి జట్టు బీహార్‌తో జనవరి 5న, ఆంధ్రతో జనవరి 12నుంచి రంజీ మ్యాచ్‌లను ఆడనుంది.

జట్టు: రహానే(కెప్టెన్‌), బిస్టా, లాల్వాణి, హార్దిక్‌ టమోరె, సర్ఫరాజ్‌ ఖాన్‌, శివమ్‌ దూబే, పార్కర్‌, ప్రసాద్‌ పవార్‌, షామ్స్‌ ములానీ, తనుష్‌ కోటియన్‌, దేశ్‌పాండే, మోహిత్‌ అవస్టి, ధవల్‌ కులకర్ణి, డియాస్‌, అంకొలేకర్‌.

➡️