ఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ అయ్యారు.కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై సోనియా, రాహుల్తో రేవంత్ చర్చించనున్నారు.