11వ రోజు: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

ssa strike 11th day eluru
  • మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 11వ రోజుకి చేరుకుంది. సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరంలో మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా సమగ్ర శిక్ష జె ఏ సి జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు
గురువులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే సమస్యలు పరిష్కారంచేయకుండా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. మరో వైపు సమస్యలు పరిష్కారం చేయకుండా కె జి బి వి ఉద్యోగులకు మెమో లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఏ ఒక్క ఉద్యోగి మీద చర్యలు తీసుకున్నా మేమంతా మూకమ్మడిగా ఉద్యోగ బాధ్యతలను నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు.
బెదిరింపులకు భయపడేది లేదని సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. 11 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కోసం ముందుకు రాకపోవడం చాలా దారుణమన్నారు. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, గ్రాడ్యుటీ మరియు 20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులైజేషన్, వేతనాల పెంపు, తక్షణమే బకాయిల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

 

ssa strike 11th day eluru

➡️