టిఎఫ్‌పిసి సీరియస్‌

Jan 13,2024 19:30 #movie, #teja

శుక్రవారం విడుదలైన ‘హనుామాన్‌’కు థియేటర్లు కేటాయించకపోవటంపై ఆయా యాజమాన్యాలపై తెలుగు చలనచిత్ర మండలి సీరియస్‌ అయ్యింది. ఒప్పందానికి విరుద్ధంగా సలార్‌ సినిమాను ప్రదర్శించటం దారుణమని ఖండించంది. ‘ఇది మంచి పద్ధతి కాదు.వెంటనే ఆయా థియేటర్లలో హనుామాన్‌ను ప్రదర్శించండి’ అంటూ ఆదేశించింది. నైజాం ఏరియా థియేటర్లలో తమ సినిమా ప్రదర్శితం కాలేదని నిర్మాత నిరంజన్‌రెడ్డి ఫిర్యాదుచేశారు. ఒప్పందం ప్రకారం తమ సినిమా ప్రదర్శన కాకపోవటంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అపారనష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రదర్శనను ప్రారంభించటంతోపాటుగా ఇప్పటివరకూ జరిగిన నష్టాన్ని కూడా థియేటర్ల యజమానులే భరించాల్సివుంటుందని ఆ లేఖలో ఆయన తెలిపారు.

➡️