పార్వతీపురంరూరల్ : బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అధికారులు ఘన నివాళ్లు అర్పించారు. జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమం, సాధికారిత శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోబిక జ్యోతి ప్రజ్వలన చేసి బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాబూ జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్ఒ జి.కేశవనాయుడు, జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమం, సాధికారిత అధికారి గయాజుద్దీన్, జిల్లా మత్స్య శాఖ అధికారి తిరుపతయ్య, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.