ఎమ్మెల్యేగా బరిలో దిగుతా : బడి సుధా యాదవ్‌

Jan 24,2024 11:34

తిరుపతి సిటీ : 2024 సాధారణ ఎన్నికల్లో తొందరగా నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతానని టిడిపి నాయకులు బడి సుధాయాదవ్‌ వెల్లడించారు. తిరుపతి రూరల్‌ పుడిపట్ల పంచాయతీలోని బడి సుధాయాదవ్‌ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ …. చంద్రగిరి నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీపడతానన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారు శిష్యుడిగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమన్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా అన్ని పంచాయతీల్లో ఆత్మీయ కలయికలు నిర్వహించానని, ఈ సందర్భంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శివ రెడ్డి భాస్కర్‌ రెడ్డి, తన కుటుంబ సభ్యుల ప్రచారం కోసం ప్రతి గ్రామంలో పలు కార్యక్రమాలు చేసి కనీసం స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పేర్లు కూడా ఇవ్వకుండా నిర్వహించి వ్యవహరించారని చెప్పారు. ఇటీవల అతని ఇంటికి వచ్చిన పాత్రికేయులను సైతం అవమాన రీతిలో హేళనగా మాట్లాడారని అతని తీరు ఆక్షేపనీయమన్నారు. అభ్యర్థి ఎంపికలో టిడిపి అధినేత ఇప్పటికే సర్వే ప్రారంభించారని, అందులో అనుకూలంగా సర్వే వస్తే తప్పకుండా ఎమ్మెల్యే బరిలో నిలుస్తానని వెల్లడించారు. రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనను ఆదరించాలని కోరారు.

➡️