కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి : పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు జంగా గౌతమ్‌

Dec 4,2023 21:16 #Congress

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయస్ఫూర్తితో ఎపిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు జంగా గౌతమ్‌ అన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, అభివృద్ధిని కోరుకునే ప్రజలు, నాయకులు కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని కోరారు. ఈ నెల 13న విజయవాడలో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎన్నికల రోడ్‌ మ్యాప్‌ను రూపొందించి ఎన్నికల్లో ముందంజ వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. శ్రీనివాస్‌ మృతి తీరని లోటు : గిడుగుపిసిసి ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన జక్కా శ్రీనివాస్‌ మృతి పార్టీకి తీరని లోటని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పొన్నూరులోని శ్రీనివాస్‌ మృతదేహం వద్ద నివాళులర్పించారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️