పొన్నలూరు (ప్రకాశం) : సిఎం జగన్ చేపట్టిన ‘ మేమంతా సిద్ధం ‘ 10వ రోజు బస్సు యాత్ర ఆదివారం ఉదయం జువ్విగుంట క్రాస్ నుంచి ప్రారంభమైంది. జువ్విగుంటక్రాస్ స్టే పాయింట్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి వైసిపి లో చేరినవారికి ముఖ్యమంత్రి జగన్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం పొన్నలూరు మండలం అగ్రహారంలో బస్సు యాత్ర కొనసాగుతోంది.