కాబుల్ :కాబూల్లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో కోస్టర్ మోడల్గా గుర్తించబడిన బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు గురించి కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ది ఖొరాసన్ డైరీకి ధృవీకరించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో 14మంది గాయపడ్డారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.