హిజ్బుల్లా కమాండర్ సహా 10మంది మృతి
బీరుట్ : దక్షిణ లెబనాన్లోని నబతియె నగరంపై ఇజ్రాయిల్ బలగాలు జరిపిన దాడిలో హిజ్బుల్లా కమాండర్తో సహా పది మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు పౌరులు కూడా వున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. బుధవారం నాటి దాడిలో కూడా ముగ్గురు పౌరులు చనిపోయారు. సావానెV్ాలో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం ఆరంభమైన తర్వాత లెబనాన్లో ఇంతమంది సామాన్యులు మరణించడం ఇదే. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు మరింత విస్తరించగలవన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నెల 8న డ్రోన్ దాడి జరిగిన సమయంలో హిజ్బుల్లా కమాండర్ అలీ అల్ దెబ్స్ను లక్ష్యంగా చేసుకుని గాయపరిచారు. తాజా దాడిలో చనిపోయాడని ఆ వర్గాలు తెలిపాయి. కమాండర్తోపాటూ వున్న మరో ఇద్దరు హిజ్బుల్లా కార్యకర్తలు కూడా ఈ దాడిలో చనిపోయారు.