వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి : 8 మంది పాలస్తీనీయుల మృతి

గాజా స్ట్రిప్‌ : కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒకవైపు కొనసాగుతుండగా మరో వైపు వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడులకు దిగింది. శరణార్థి శిబిరాలను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని నెతన్యాహూ సైన్యం శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో 8 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. జెనిన్‌ శరణార్థి శిబిరంలో ఐదుగురు చనిపోగా.. సెంట్రల్‌ వెస్ట్‌బ్యాంక్‌లో ఒకరు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇజ్రాయిల్‌కు చెందిన తండ్రీకొడుకులను కారుతో ఢకొీట్టి చంపిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లగా..అక్కడివారు తమపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు నెతన్యాహూ సైన్యం బుకాయిస్తోంది.

హమాస్‌ సీనియర్‌ కమాండర్‌ మృతి

ఇజ్రాయిల్‌ జరిపిన మరో దాడిలో తమ సీనియర్‌ కమాండర్‌ ఒకరు చనిపోయారని హమాస్‌ ధ్రువీకరించింది. ఉత్తర గాజా ప్రాంతానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న అహ్మద్‌ అల్‌ ఘాందౌర్‌ అనే బ్రిగేడ్‌ కమాండర్‌ ఇజ్రాయిల్‌ దాడిలో మరణించినట్లు హమాస్‌ పేర్కొంది. ఆయన ఎప్పుడు, ఎక్కడ మరణించా రనే వివరాలు వెల్లడించలేదు. ఈ దాడిలో మరో ముగ్గురు మిలిటరీ నేతలూ చనిపోయిన ట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు మతిచెందిన హమాస్‌ సభ్యుల్లో ఇతడే కీలకమైన వ్యక్తి అని అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గతంలో ఇజ్రాయెల్‌ హత్యా ప్రయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నట్లు తెలిపాయి. 2017లో అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆర్థిక ఆంక్షలూ విధించింది. అంతకుముందు నిరిమ్‌ మారణకాండకు బాధ్యుడైన బిలాల్‌ అల్‌ కేద్రా, హమాస్‌ ఏరియల్‌ ఫోర్స్‌ హెడ్‌ అబు మురద్‌, నక్బా యూనిట్‌ కమాండర్లు అహ్మద్‌ మౌసా, అమర్‌ అల్హంది తదితరులను ఇజ్రాయెల్‌ సైన్యం చంపేసింది.

➡️