ప్రజాశక్తి – భీమవరం టౌన్
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీని వైసిపి ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత నెల 13న జరిగిన ఎన్నికల్లో ప్రణాళికాబద్ధమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.