Gaza : నివాసిత భవనం లక్ష్యంగా ఇజ్రాయిల్‌ వైమానిక దాడి.. 11 మంది మృతి

టెల్‌ అవీవ్‌ :    గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం అర్థరాత్రి గాజా నగరంలోని వాయువ్య ప్రాంతంలోని ఓ నివాస భవనం లక్ష్యంగా ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 11 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

అల్‌-షిఫాపై ఇజ్రాయిల్‌ చేపడుతున్న అమానుష దాడి ఐదోరోజుకి చేరుకుంది. ఆస్పత్రి నుండి రోగులను తరలించడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు తెలిపారు. వందలాది రోగులు, వైద్యసిబ్బందిని ఆస్పత్రిని వదిలి వెళ్లాల్సిందిగా ఇజ్రాయిల్‌ సైన్యం ఇటీవల   ప్రకటించిన సంగతి తెలిసిందే.  అల్‌-షిఫా ఆస్పత్రి లోపలికి వెళ్లడం కష్టతరంగా ఉందని సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది ప్రకటించింది.  ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని పేర్కొంది. పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని అన్నారు.

➡️