కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం తోప్ఖానా పర్వతాల్లో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. చైనా, తజికిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బదక్షన్ ప్రావిన్స్లో విమానం కూలిపోయిందని అన్నారు. ప్రమాద స్థలం గురించి ఖచ్చితమైన సమాచారం లేదని అన్నారు. విమానం ఆచూకీ తెలియలేదని అన్నారు. మొదట భారత్కు చెందిన విమానం కూలినట్లు ఆఫ్ఘన్ వర్గాలు ప్రకటించాయి. కానీ ఆ విమానం భారత్ది కాదని డిజిసిఎ స్పష్టంచేసింది.