6.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం

Apr 28,2024 07:12 #Earthquake, #Indonesia

ఇండోనేషియలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది. రాజధాని జకార్తాతో పాటు బాంటెన్‌ ప్రావిన్స్‌, సెంట్రల్‌ జావా ప్రావిన్స్‌, యోగ్యకార్తా, తూర్పు జావా ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గౌత్‌ రెజెన్సీకి నైరుతి వైపున 151 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు దేశ మెటియొరాలజీ శాఖ పేర్కొంది. భూకంపంతో సునామీ ప్రమాదం లేకపోవడంతో వాతావరణ ఏజెన్సీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

➡️