న్యూయార్క్‌లో కాల్పులు : ఒకరి మృతి : ఐదుగురికి తీవ్రగాయాలు

న్యూయార్క్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా న్యూయార్క్‌లోని బ్రూనక్స్‌ ప్రాంతంలోని ఒక సబ్‌వే స్టేషన్‌ వద్ద సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని న్యూయార్క్‌ నగర పోలీసు విభాగం అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. న్యూయార్క్‌ సబ్‌వే వ్యవస్థ అక్కడి రవాణ వ్యవస్థలో చాలా కీలకంగా ఉంటుంది. సబ్‌వే వ్యవస్థ ద్వారా వారానికి దాదాపు 3.8 మిలియన్‌ ట్రిప్‌లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా ఇటీవల సంవత్సరాల్లో దాడులు పెరుగుతున్నాయి. గత ఏడాది 2023లో సబ్‌వే స్టేషన్లలో 570 నేరపూరిత దాడులు జరిగాయి.

➡️