సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై అనుమానాస్పద దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్పై దాడికి సన్నద్ధమవుతున్నామని, ఈ విషయంలో కలగజేసుకోవద్దంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్పై దాడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. మధ్యలో కలగజేసుకుంటే అమెరికా కూడా దెబ్బతింటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ జంషిద్ ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ లేఖపై స్పందించిన అమెరికా తమపై దాడులు చేయవద్దంటూ కోరిందన్నారు. మధ్యప్రాచ్యంలో తన ప్రధాన మిత్రపక్షమైన మిలిటెంట్ గ్రూపు ‘హిజ్బుల్లా’.. ఇజ్రాయెల్పై దాడికి సన్నద్ధమవుతున్న వేళ ఇరాన్ ఈ లేఖ రాయడం గమనార్హం. కాగా ఇరాన్ లేఖపై అమెరికా అధికారికంగా ఇప్పటివరకూ స్పందించలేదు.