గ్యాస్‌ సబ్సిడీ రూ.30,244 కోట్లు కోత

Dec 12,2023 10:38 #gas cylinder

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: కేంద్రంలోని మోడీ సర్కారు గ్యాస్‌ సబ్సిడీకి భారీగా కోత విధించింది. ఐదేళ్లలో రూ.30,244 కోట్ల గ్యాస్‌ సబ్సిడీని కోత కోసింది. దీంతో దేశంలోని సామాన్య ప్రజలకు భారం తీవ్రంగా పెరిగింది. రాజ్యసభలో సిపిఎం ఎంపి వి శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018-19లో రూ.37,209 కోట్లు ఉన్న గ్యాస్‌ సబ్సిడీ, 2022-23 నాటికి రూ.6,965 కోట్లకు తగ్గింది. ఐదేళ్లలో రూ.30,244 కోట్ల గ్యాస్‌ సబ్సిడీని మోడీ ప్రభుత్వం తగ్గించింది.

పెట్రోలియం పిఎస్‌యుల్లో ఖాళీలు

పెట్రోలియం మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు)ల్లో 2,920 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ అన్నారు. రాజ్యసభలో సిపిఎం ఎంపి ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 డిసెంబరు 5 నాటికి పెట్రోలియం పిఎస్‌యుల్లో 2,920 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

➡️