కవిత రూ.100 కోట్లిచ్చారు

  • ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో…లబ్ది పొందేలా ఎమ్మెల్సీ డీల్‌
  • కేజ్రీవాల్‌, సిసోడియాలతో కలిసి కుట్ర : ఇడి ప్రకటన
  • సోదాల టైంలో కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని వెల్లడి

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమలులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అగ్రనేతలైన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సిఎం మనీష్‌ సిసోడియాలతో కలిసి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు బదులుగా కవిత, ఆప్‌ నేతలకు రూ.వంద కోట్లు చెల్లించడంలో పాలుపంచుకున్నారని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అవినీతి, కుట్రల ద్వారా హోల్‌ సేలర్స్‌ నుంచి కిక్‌ బ్యాక్‌ రూపంలో నిరంతరం అక్రమంగా నిధులను ఆప్‌ మళ్లించబడ్డట్లు తెలిపింది. ఈ కుట్ర ద్వారా కవిత, ఆమె భాగస్వాములు ఆప్‌కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందాల్సి ఉందని పేర్కొంది. ఈ మొత్తం కుట్రలో లాభాలు/ వసూళ్లను మరింతగా సృష్టించాల్సి ఉందని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఈడీ కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈ నెల 15 న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోదాల అనంతరం ఎమ్మెల్సీ కవితను ఇడి (హెచ్‌ క్యూఆర్‌ఎస్‌) ఆఫీస్‌ అదుపులోకి తీసుకుందని తెలిపింది. 16వ తేదిన స్పెషల్‌ కోర్టు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కోసం ఈ నెల 23 వరకు ఈడీ కస్టడికి అప్పగించిందని వెల్లడించింది. కాగా ఆమె ఇంట్లో సోదాలు జరుగుతోన్న సందర్భంలో కవిత బంధువులు, సన్నిహితులు ఇడి అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంది.
రూ. 128.79 కోట్లు సీజ్‌
ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, ముంబై, తదితర ప్రాంతాలతో సహదేశ వ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఆప్‌కు చెందిన మనీష్‌ సిసోడియా, సంజరు సింగ్‌, విజరు నాయర్‌తో సహా 15 మందిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. రూ. 128.79 కోట్లు సీజ్‌ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక ప్రాసిక్యూషన్‌(నేరారోపణ), ఐదు సప్లమెంటరీ కంప్లైట్స్‌ను దాఖలు చేసినట్లు ఇడి పేర్కొంది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కొనసాగుతోందని ప్రకటనలో స్పష్టం చేసింది.
నేడు సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్‌
ఇడి అరెస్ట్‌ పై తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్ట్‌ తర్వాత తొలిసారి సుప్రీంకోర్టు ముందుకు గతంలో ఆమె దాఖలు చేసిన 105 పేజీలతో కూడిన రిట్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) విచారణకు రానుంది. దర్యాప్తు సంస్థల తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు
తన అరెస్ట్‌ ను నిరసిస్తూ కవిత న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. ఒకవైపు సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ పెండింగ్‌ లో ఉండడం, మూడు రోజుల్లో పిటిషన్‌ మరోసారి బెంచ్‌ ముందుకు రానున్న టైంలో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్‌ చేసిందని సోమవారం ఉదయం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ

➡️