పుణె: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 150 స్క్రాప్ షాపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పుణె సిటీలోని చించ్వాడ్ ప్రాంతంలోగల కుడల్వాడి ఏరియాలో 150 స్క్రాప్ షాపులకు మంటలు అంటుకున్నాయని తెలిపారు. ఏరియా అంతటా పెద్దఎత్తు మంటలు చెలరేగాయని.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగకమ్మిందని తెలిపారు. దీంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. అర్థరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరుగగా తెల్లవారుజామున మంటలు అదపులోకి వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.