న్యూఢిల్లీ : ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. శనివారం వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలోని దాదాపు 20 విమానాలను దారి మళ్లించినట్లు ఓ అధికారి తెలిపారు. జైపూర్, అమృత్సర్, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్లకు మళ్లించినట్లు అధికారి తెలిపారు. శనివారం ఉదయం 7:30 నుండి 10:30 గంటల మధ్య విమానాలను దారి మళ్లించినట్లు అధికారి తెలిపారు. 13 విమానాలను జైపూర్కి, నాలుగు అమృత్సర్, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్లకు ఒక్కొక్కటి చొప్పున మళ్లించినట్లు అధికారి తెలిపారు. విమానాల రాకపోకలకు వాతావరణం అనుకూలంగా లేదని, దృశ్యమానత సరిగ్గాలేదని ఢిల్లీ ఎయిర్పోర్ట్ 8.10 గంటల సమయంలో సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది.