ముంబయి : అజిత్ పవార్ వర్గం బుధవారం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఒకవేళ ఇసి ఆదేశాలను సవాలు చేస్తూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, అజిత్ పవార్ వర్గానికి వ్యతిరేకంగా ఎటువంటి ఎక్స్- పార్ట్ ఆర్డర్ను జారీ చేయకుండా చూసేందుకు వారి తరపున న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ఈ కేవియట్ను దాఖలు చేశారు. మహారాష్ట్రలో నేషనలిన్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) గుర్తింపు అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక గ్రూపుకే చెందుతుందని ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్సిపి ఎన్నికల గుర్తు ‘గోడ గడియారం’ కూడా ఆ గ్రూప్నకే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.