ఇండోర్ : బిజెపి అనైతిక రాజకీయ క్రీడ కొనసాగుతోంది. ఇటీవల సూరత్లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నామినేషన్ తిరస్కరింపజేసి, స్వతంత్ర అభ్యర్థులందరి నామినేషన్లు ఉపసంహరింపజేసి, బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తతంగంలో కమలం పార్టీ అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తినా…. వారి తీరు ఏమాత్రం మారలేదు. తాజాగా ఇండోర్ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అక్షరు కాంతి బామ్ తన నామినేషన్ను సోమవారం ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. బిజెపి ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి రిటర్నింగ్ ఆధికారి కార్యాలయానికి వెళ్లిన బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. బిజెపి సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలేష్ విజరు వర్గీయతో కలిసి కారులో వెళ్తున్న ఫొటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. బామ్కు బిజెపిలోకి స్వాగతం పలుకుతూ బిజెపి నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇండోర్లో మే 13న ఎన్నికలు జరుగుతాయి. బిజెపికి చెందిన సిట్టింగ్ ఎంపి శంకర్ లాల్వానీపై బామ్ను పోటీకి నిలపగా, ఆయన బిజెపి ప్రలోభాలతో నామినేషన్ ఉపసంహరించుకోవడం గమనార్హం.