- కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్
త్రిస్సూర్ : వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఓటమి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ తెలిపారు. త్రిస్సూర్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం త్రిస్సూర్కు సమీపంలోని ఓల్లూర్లో ఎన్నికల సభలో శివకుమార్ మాట్లాడారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యుడిఎఫ్ అభ్యర్థి కె. మురళీధరన్ తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్డిఎ దేశంలో క్రమంగా బలహీన పడుతోందని అన్నారు. అందుకే ఎన్డిఎ అసురక్షిత భావనతో ఉందని, కాబట్టే వివిధ రాష్ట్రాల్లో ఏ పార్టీతో అయినా పొత్తుకు సిద్దంగా ఉందని అన్నారు. కర్ణాటకతో జెడిఎస్తోనూ, బీహార్లో నితీష్కుమార్తోనూ, ఆంధ్రప్రదేశ్లో టిడిపితోనూ పొత్తుపెట్టుకుందని విమర్శించారు.