ముర్షీదాబాద్ : లెఫ్ట్ఫ్రంట్, కాంగ్రెస్ అభ్యర్థుల విజయంతోనే బెంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని సిపిఎం నాయకులు తెలిపారు. లెఫ్ట్ఫ్రంట్, కాంగ్రెస్ బలపరిచిన ముర్షీదాబాద్ సిపిఎం అభ్యర్థి మహ్మద్ సలీమ్కు మద్దతుగా కరీంపూర్ బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సుమిత్ దేవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు మీనాక్షి ముఖర్జీతోపాటు మయూక్ బిశ్వాస్, జమీర్ మొల్లా తదితరులు ప్రసంగించారు.