ముంబై : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపి మిలింద్ దియోర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. మిలింద్ రానున్న లోక్సభ ఎన్నికల్లో సౌత్ ముంబై లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. కానీ మిత్రపక్షమైన శివసేన (యుబిటి) ఆ టికెట్ను అరవింద్ సావంత్కి ఇచ్చేందుకు సిద్ధమైంది. సౌత్ ముంబై నుంచి అరవింద్ సావంత్ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ముంబై సీటును ఇతర పార్టీలకు ఇచ్చేది లేదని సావంత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిలింద్ దియోరా షిండే ఆధ్వర్యంలో శివసేనలో చేరినప్పటికీ ఆయనకు టికెట్ ఇస్తారనే గ్యారెంటీ లేదు. సౌత్ ముంబై లోక్సభ సీటుకు బిజెపి అభ్యర్థి పోటీలో దిగే అవకాశం ఉంది. అయితే మిలింద్కు రాజ్యసభ సీటును సిఎం షిండే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళీ దియోరా కుమారుడే మిలింద్ దియోరా.