చెన్నై : తమిళనాడులో సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సెంట్రల్ చెన్నై నియోజకవర్గంలోని పురసవల్కంలో జరిగిన ఎన్నికల సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. దయానిధి మారన్ను మరోసారి ఎన్నుకోవాలని కోరారు. ఇండియా వేదిక, సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. మధురైలో సిపిఎం అభ్యర్థి వెంకటేశన్ను గెలిపించాలని కోరుతూ ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్హాసన్ విస్తృత ప్రచారం నిర్వహించారు.