ముంబై : ముంబై-నాగపూర్ ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్వాంచి గ్రామ సమీపంలోని ముంబై-నాగపూర్ ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాంగ్ రూట్లో వెళ్లిన కారు మరో కారును ఢీకొంది. దీంతో, ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న బారికేడ్లపై పడిపోయింది. కారులో ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/road-acidnet.jpg)