విజయన్‌ కుమార్తెపై ఇడి కేసు

కొచ్చి: దర్యాప్తు సంస్థలను పెద్దయెత్తున దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణా విజయన్‌పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా విజయన్‌ గట్టిగా గళం విప్పుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమార్తె వీణాపై ఇడి మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేస్తామని ఇడి తెలిపింది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు.

➡️