కోల్కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బిజెపి నేత దిలీప్ ఘోష్పై దుర్గాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎఫ్ఐఆర్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ” శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మహిళ అణకువను అవమానించేలా వ్యాఖ్య, సంజ్ఞలు లేదా చర్యలు ” నేరాల కింద కేసు నమోదైంది.