మహిళకు వివాహమైతే విధుల నుండి తొలగిస్తారా ? 

If a woman gets married, will she be dismissed from her duties
  • ఆ నిబంధనలు లింగ వివక్షే, రాజ్యాంగ విరుద్ధం కూడా
  • సైన్యానికి తలంటిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు సంబంధించి సైన్యానికి అనుబంధంగా పనిచేసే మిలటరీ నర్సింగ్‌ సర్వీసెస్‌లో ఇటీవల తీసు కొచ్చిన నిబంధనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేసింది. వివాహం చేసుకుంటు న్నందుకు లేదా ఇంట్లో సమస్యలున్నందుకు మహిళా ఉద్యోగులను వారి ఉద్యోగాల నుండి తొలగించాలన్నది ఆ నిబంధనల సారాంశం. ఇవి రాజ్యాంగ విరుద్ధమైన నిబంధనలని, తీవ్రమైన లింగ వివక్ష కిందకు వస్తాయని సుప్రీంకోర్టు సైన్యానికి తలంటింది. మహిళకు పెళ్లైందనే కారణంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించడం దారుణమైన లింగ వివక్షకు, అసమానతలకు నిదర్శనమని కోర్టు ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. ఇటువంటి పితృస్వామ్య నిబంధనను ఆమోదించడం మానవ గౌరవాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. లింగ ప్రధానమైన పక్షపాతాల ప్రాతిపదికన చట్టాలు, నిబంధనలు రూపొందించడం రాజ్యాంగపరంగా అనుమతి యోగ్యం కాదని స్పష్టం చేసింది. మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో మహిళా పర్మినెంట్‌ కమిషనర్‌ ఆఫీసర్‌ హక్కులను పరిరక్షిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు వెలు వడ్డాయి. ఆమె వివాహం చేసుకుంటోందన్న కారణంగా ఆమెను విధుల నుండి తొలగించారు. మాజీ లెఫ్టినెంట్‌ సెలీనా జాన్‌కు 8 వారాల్లోగా పూర్తిగా రూ.60 లక్షలను నష్టపరిహారంగా చెల్లించాలని జస్టిస్‌ సంజరు ఖన్నా నేతృత్వంలోని బెంచ్‌ కేంద్రాన్ని ఆదేశించింది. ఆమెకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చిన సాయుధ బలగాల ట్రిబ్యునల్‌ లక్నో బెంచ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్రం అప్పీల్‌ చేసింది. ఆమెను సర్వీసు నుండి తొలగించడమనేది ‘తప్పు, అక్రమం’ అని స్పష్టం చేసింది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ల్లో మహిళలను సమానంగా చూడాలిమహిళా ఆఫీసర్లకు పర్మినెంట్‌ కమిషన్‌ను తిరస్కరించినందుకు కేంద్రం, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసిజి)లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మహిళలను కూడా సమానంగా చూసేలా ఒక విధానాన్ని రూపొందించాలని కోస్ట్‌ గార్డ్‌ బలగాలను ఆదేశించింది. ఐసిజిలో అర్హత గల వుమెన్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లకు శాశ్వత నియామకాన్ని మంజూరు చేయాలని కోరుతూ మహిళా అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. మహిళా శక్తి గురించి మాట్లాడతారు కదా, ఇప్పుడు అది చూపించండి అని చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది.

➡️