పూరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జై నారాయణ్‌ పట్నాయక్‌

May 6,2024 01:41 #2024 election, #CONGRES

పూరీ : ఒడిశాలోని పూరీ నియోజకవర్గానికి ఇంతకు ముందే ఖరారైన సుచరిత బదులు జై నారాయణ్‌ పట్నాయక్‌ని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎంపి బ్రజామోహన్‌ మహంతీ కుమార్తె, మాజీ జర్నలిస్టు అయిన సుచరితా మహంతిని కాంగ్రెస్‌ పార్టీ పూరీ నియోజకవర్గానికి తొలుత ప్రకటించింది. అయితే తన దగ్గర డబ్బుల్లేవంటూ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. తనకు అధిష్టానం ఆర్థిక సహకారం నిరాకరించిందని.. దీంతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని కెసి వేణుగోపాల్‌కు లేఖ రాశారు. సుచరిత పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో నారాయణ్‌ పట్నాయక్‌ బరిలో నిలిచారు. కాగా పూరీ లోక్‌సభ స్థానానికి ఆరోవిడతలో మే 25న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్లకు చివరి గడువు మే 6 వరకు ఉంది.

➡️