న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.
పలు రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ వివరాలు
పశ్చిమబెంగాల్ -66.05 శాతం
ఆంధ్రప్రదేశ్ -55.49 శాతం
బీహార్ – 45.23 శాతం
జమ్ముకాశ్మీర్ -29.93 శాతం
జార్ఖండ్ -56.42 శాతం
మధ్యప్రదేశ్ -59.63 శాతం
మహారాష్ట్ర -48.35 శాతం
ఒడిశా-52.91 శాతం
తెలంగాణ -52.34 శాతం
ఉత్తరప్రదేశ్ -48.41 శాతం