రామేశ్వరం పేలుడు ఘటన అనుమానితుని ఫొటోలను రిలీజ్‌ చేసిన ఎన్‌ఐఎ

బెంగళూరు : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేఫ్‌లో సిసిటివి ఫుటేజ్‌ ఆధారంగా అనుమానితుడు ముఖానికి మాస్క్‌ ధరించి, తలకు టోపీ పెట్టుకుని బస్సు నుంచి దిగి కేఫ్‌లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఘటనకు పాల్పడిన అనుమానితుడు ఫొటోలను ఎన్‌ఐఎ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) కొత్త ఫొటోలను రిలీజ్‌ చేసింది. తాజాగా ఎన్‌ఐఎ విడుదల చేసిన ఫొటోల్లో నిందితుడు పింక్‌ కలర్‌ టీ షర్ట్‌ ధరించి ముఖానికి మాస్క్‌ ధరించి, భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని నడుస్తున్నట్టుగా ఉంది.

➡️