రాయపూర్ : ఛత్తీస్గఢ్లో శుక్రవారం తొలిదశలో ఎన్నికల్లో భాగంగా బీజాపూర్, కుంట, జగదల్పూర్, దంతేవాడ, సుక్మా, బస్తర్ ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే ఛత్తీస్గఢ్లో ఒక్క గ్రామంలో మాత్రం అసలు పోలింగే జరగలేదు. ఆ గ్రామం నుంచి ఒక్కరూ ఓటేయలేదు. ఇంతకీ ఆ వూరు పేరు పువర్తి. ఈ గ్రామం మావోయిస్టు నాయకుడు, వ్యూహకర్తగా పేరున్న హిడ్మా సొంతూరు. ఈ ఊరు బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్న సుక్మా జిల్లా పరిధి కిందకు వస్తుంది. మావోయిస్టుల హెచ్చరికల మేరకే ఆ ఊరి ప్రజలు ఓటేయలేదు. భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్గా హిడ్మా ఉన్నాడు.