భువనేశ్వర్ : ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. హింజిలినే కాకుండా.. కంతబంజి నియోజకవర్గం నుంచి కూడా నవీన్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా లోక్సభ ఎన్నికలతో పాటు మే 13 నుంచి జూన్ 1 వరకూ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/naveen.jpg)