న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. కాంతి భాటి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఆయనను పదవి నుండి తొలగించేందుకు చట్టపరమైన హక్కు లేదని తెలిపింది. ‘ఎల్జి వికె సక్సేనా కోరుకుంటే చర్య తీసుకోనివ్వండి.. మేం మొగ్గు చూపడం లేదని’ పేర్కొంది. కేజ్రీవాల్ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను ఏప్రిల్ 10న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.